విశేషములు

గురుస్తాన్ నుండి ఖండోబా మందిరానికి వెళ్లేటప్పుడు హైవే ప్రక్కనే ఉన్న షిర్డీలో ఒక కనిఫ్నాద్ మందిర్ ఉంది. అతను మాచిందర్ నాధ్ లానే నవనాధులలో ఒకరు. శ్రీపాద శ్రీ వల్లభా ​​స్వామి చెప్పినట్లుగా (శ్రీపాద శ్రీ వల్లభ స్వామి నవనాథ అని అని స్మరించిన వారి అనంత పాపరాశి తొలగిపోవును అని అన్నారు.)... నవనాథుల పేరును జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, ఎక్కువ పుణ్యాన్నీ పొందవచ్చు. శ్రీ సాయి సత్చరిత్ర 45వ అధ్యాయంలో కూడా ఈ నవనాధుల గురించి ప్రస్తావించబడింది.

మనం శ్రీ సమాధి మందిరంలో ఉన్న M.B. రేగే గారి ఫోటో చూశాము. ఈరోజు ఆయనది ఇంకొక ఫోటో చూద్దాం ......
పై ఫోటోలో కూడా ఆయన సంతకాన్ని మనం గమనించవచ్చు. ఇండోర్ మధ్యప్రదేశ్‌కు చెందిన తల్లి రాధా కృష్ణ మరియు పురుషోత్తం అవాస్తేతో ఆయనకు సన్నిహిత సంబంధం ఉంది. మరియు ఇద్దరూ ఆమె ద్వారా చాలా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందారు.

కోపర్ గావ్ రైల్వే స్టేషన్ వద్ద ప్లాట్ఫాం నెం .1 లో ఉన్న శ్రీ సాయిబాబా ఫోటో. ఆ రోజుల్లో షిర్డీకి రైల్వే స్టేషన్ లేదు..షిర్డీని దర్శించే సందర్శకుల సాయి భక్తులు ప్రయాణాలలో ఈ కోపర్ గావ్ రైల్వేస్టేషన్ ముఖ్యమైన పాత్ర వహించింది. శ్రీ సాయిబాబా సాహిత్యంలో సూచనగా ఉంది.

 శ్రీ సాయి సత్చరిత్ర 15వ అధ్యాయంలో  థానే (రైల్వేస్టేషన్ రోడ్) దగ్గర ఉన్న  కౌపినేశ్వర మందిరం.  ఒకసారి దాసగాను అద్భుతమైన గణసంకీర్తనను ఇక్కడ ప్రదర్శించారు.  బాపు సాహెబ్ జాగ్ గారి బంధువు అయిన చోల్కర్ ఆ సంకర్తనను  విన్నారు, షిర్దిని సందర్శించి గొప్ప సాయిభక్తడు అయ్యారు.

 ఈ మందిరానికి దగ్గరలో B.V.దేవ్ గారి ప్రస్తుత వారసుడు నివసిస్తున్నారు.

*మహల్సాపతి గారి ఇల్లు*

*మహల్సపతి గారి ఇల్లు చావడి నుండి తాజిమ్ ఖాన్ దర్గ వద్ద ఉన్న ఇరుకైన సందులో ఉంటుంది. దర్గ వద్ద, అది ఎడమవైపుకి తిరిగి, కొన్నిగజాల దూరం నడిస్తే ఇల్లు ఇరుకైన సందులో కుడి వైపున ఉంటుంది. శ్రీ సాయిబాబా అతనికి 1922 సెప్టెంబర్ 12 న సద్గతిని ఇచ్చారు. అనగా, భాద్రపద బహుల షష్ఠి సోమవారం నాడు శరీరాన్ని విడిచి పెట్టారు. అతని సమాధిని తన ఇంటిలోనే ఉంది. ఈ క్రింది పవిత్రమైన వస్తువులను శ్రీసాయిబాబా మహల్సపతికి ఇచ్చారు.*
*శ్రీ సాయిబాబా ధరించిన కాఫ్ని.*
*శ్రీ సాయిబాబా దండా*
*శ్రీ సాయిబాబా ఊదీ.*
*మూడు వెండిరూపాయి నాణేలు*
*శ్రీ సాయిబాబా ధరించిన పాదుకలు (తోలుతో చేసిన పాదుకలు).*
*మహల్సాపతి ఇంటికి శ్రీ సాయిబాబా ఇచ్చిన పవిత్రమైన విషయాలు వలన మరియు మహల్సాపతి సమాధి ఉండటం వలన పవిత్ర తీర్థయాత్ర స్థలంగా మారింది. మహల్సాపతి నిజంగా శ్రీ సాయిబాబా వారికి నిజమైన భక్తుడు, అతను నిజంగా చాలా పేదవాడు అయినప్పటికీ అతను తన ఆధ్యాత్మిక మార్గం నుండి తప్పుకోలేదు. అతను ఎవరి వద్దనుండి డబ్బు లేదా బహుమతులను స్వీకరించ వద్దని శ్రీ సాయిబాబా చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నారు. మార్గశిర్ష మాస సందర్భంగా “72 గంటలు సమాధి” శ్రీ సాయిబాబా వారు తీసు కున్నప్పుడు శ్రీ సాయిబాబా శరీరాన్ని కాపాడినందుకు శ్రీసాయిభక్తులు మహల్సాపతికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకోవాలి. (శ్రీ సాయి సచ్చరిత అధ్యాయాలు 43 మరియు 44 చూడండి). అతని వారసులు ఈ వస్తువులను చాలా చక్కగా భద్రపరిచారు. షిర్డీని సందర్శించే మనం అందరం కూడా వాటిని ఆ ఇంటింని దర్శించవచ్చు.*
*ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి*
* (మూలం: దివంగత శ్రీ బి.వి.నరసింహ స్వామీజీ, శ్రీ సాయిలీలా పత్రిక, జూలై - ఆగస్టు 2005, శ్రీ. సందీప్ నాగారే, మహల్సపతి గొప్ప మనవడు, ఫోటో కర్టసీ: శ్రీ.సందీప్ నగరే, మహల్సపతి గొప్ప మనవడు
రాధా కృష్ణ మాయి ఒక గొప్ప మహిళా శ్రీసాయి భక్త శ్రేష్ఠురాలు అని చెప్పుకోవచ్చు..... శ్రీ సాయి సంస్థాన్ ఏర్పాటుకు మూలం.....
ఆమె కృషి ద్వారా బాబా వారి రాజదర్బార్ గంభీరమైన గొప్పసంస్థన్ మార్చబడింది.
శ్రీ రామనవమి ఉత్సవం, చావాడి ఉత్సవం అలంకారాలు, హారతులు, నైవేద్యాలు, నామసప్తహాలు మొదలైనవి ఆమె ఇలా1 వాటిలో కొన్ని ఆమె వలనే ఏర్పాటు చేయబడి నిర్వహించేది.
శ్రీ సాయి సచ్చారితలో 6వ అధ్యాయం ఆధారంగా..........
షిర్డీలో ఉన్న వీధులు అన్నింటినీ ఆమె చీపురుతో స్వయంగా తుడుచేది.......
ఆవీదులలో శ్రీసాయిబాబా వారు నడిచేవారు. కోట్ గల్లీ, షిండే వాడా, గురుస్తాన్ రోడ్, విట్ఠల్ మందిరం వెళ్లే క్రాస్‌రోడ్ లు మొదలైనవి అన్ని ఆమె చేసిన సేవ వలనే ఎప్పుడూ శుభ్రంగా ఉండేవి.
తెల్లవారుజామున ఆమె ఈ సేవ చేస్తూ ఉండేవారు.ఎందుకంటే ఆమె పగటిపూట తన గదిలో నుండి బయటకు వచ్చేవారు కాదు.అంతే కాకుండా ఆమె ముఖం కనబడకుండా తలపై ఎల్లప్పుడూ ఒక ముసుగు ఉంటు ఉండేది. ఆమె వెనుకకు తుడుచుకునేది. ఆమె ప్రధాన ఉద్దేశ్యం శ్రీసాయిబాబా వారు పాదాలను తాకే నేల మొదట పవిత్రంగా ఉండాలి అని.... ఆధారం ఒక పాత సాయి లీలా పత్రిక మరియు విన్నీ మా సాహిత్యం.
ఆమె గురించి ప్రస్తావన శ్రీ సాయి సత్చారిత్ర లో 6వ అధ్యాయంలో ఉంటుంది. ఆమె ఇంటి గురించి శ్రీ సాయి సత్చారిత్ర .18 & 19వ అధ్యాయంలో చివరిలో ఉంటుంది.
పాత సాయి లీలా పత్రిక నుండి సేకరించిన ఫోటో. సాయి లీలా పత్రిక సంపాదకుడు చకోర్ అజ్గోవ్కర్ ఈ వ్యాసాన్ని తయారు చేసి వుండవచ్చు అని నా అభిప్రాయం......
రాధా కృష్ణ మాయి షిర్డీ గ్రామ వీధులను తుడుచేవారు అని తెలుసుకున్నాము.ఆమె కన్నా ముందు ఆ వీధులను న్యూసా గ్రామానికి చెందిన బాలాజీ పాటిల్ న్యూవాస్కర్ గారు ఆ పని చేసేవారు. దురదృష్టవశాత్తు చాలా చిన్న వయస్సులోనే రాధా కృష్ణ మాయి తన శరీరాన్ని షిర్డీలో వున్న తన గదిలో వదిలివేసారు.
అందువలన ఆ వీధులను తుడిచే సేవను అబ్దుల్లా తీసుకొని చాలా కాలం చేసారు.
శ్రీ సాయి సచ్చారిత 35వ అధ్యాయం ఆధారంగా......
ఈ రోజు(8th March) ఒక ప్రత్యేక మైన రోజు. శ్రీ సాయిబాబా తన భౌతిక రూపంలో ద్వారకమాయిలో నివసిస్తున్నప్పుడు చాలా దూర ప్రాంతాలకు వెళ్ళారు. ఉదాహరణకు శ్రీసాయి సత్చరిత్ర 9వ అధ్యాయంలో......
అయితే 1917 లో ఇదే రోజున అనగా (8-3-1917), గురువారం మరియు పవిత్ర మైన పండుగ రోజు, తెల్లవారుజామున శ్రీ సాయిబాబా హేమద్‌పాంత్‌కు కలలో కనిపించి ఒక్క విషయాన్ని చెప్పారు. ఆవిషయం ఇదే రోజున భోజనం కోసం తన ఇంటికి వస్తానని తెలియచేసారు. అతను శ్రీ సాయిబాబా మాటను ఎప్పుడూ ఉల్లంఘించనందు వలన .... అతను ఇక్కడ కనిపిస్తున్న ఉన్న ఫోటో రూపంలో వెళ్ళారు, ఇది ఇప్పటికీ బాంద్రా వెస్ట్ ముంబైలోని హేమద్‌పాంత్ ఇంట్లో ఉంది.
ఈ రోజు (8th March)జరిగిన మరో సంఘటన ఏమిటంటే ...
ఇదే రోజు 1936 లో (8-3-1936), సోమవారం, శ్యామా మరియు ఇతర భక్తులు శ్రీ సాయిబాబా యొక్క మహాసమాధి పైన ఉన్ని శాలువకు బదులుగా పత్తి శాలువతో కప్పడం ప్రారంభించారు ఎందుకంటే మునుపటి రోజు రాత్రి ఉన్ని శాలువ కప్పవలసిన రితికి బదులుగా మరో వైపుకు తప్పుగా కప్పబడింది.
షిర్డీలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఇవి 1970వ సంవత్సరంలో తీయబడిన అరుదైన మరియు పాత ఫోటోలు. 50 సంవత్సరాల క్రితం భక్తులు శ్రీరామనవమీ వేడుకలను ఐక్యతతో, ప్రేమతో జరుపుకున్నారు, అదే సంప్రదాయం ప్రకారం శ్రీరామనవమి వేడుకలు ఈ రోజు కూడా గొప్ప ఐక్యతతో జరుగుతున్నాయి.