శ్రీ గర్భరక్షా స్తోత్రం
*ముఖ్యవిషయం:-*
1.ఈ స్తోత్రం స్తోత్రాన్ని మీరు ఎవరికి పంపించకూడదు.
- ఈ స్తోత్రాన్ని మధ్యలో ఆపివేయకూడదు.
3.మైలు సమయంలో చదవకూడదు.
4.ప్రతిరోజు ఉదయం,సాయంత్ర సమయంలో చదవడం మంచిది.
- నియమంగా కనీసం 108 రోజులుకంటే ఎక్కువ చేయాలి.
శౌనక మహర్షి విరచిత శ్రీ గర్భరక్షా స్తోత్రం:
గర్భరక్షాంబికా అంటే గర్భములో ఉన్న బిడ్డను, ఆ గర్భం ధరించిన తల్లిని కాపాడే చల్లని తల్లి సర్వ సృష్టిని సృష్టించిన తల్లి శ్రీ పార్వతీ మాతయే గర్భారక్షాంబికా తల్లిగా పిలవబడుతూ, పూజలు అందుకుంటుంది. సమస్త జగత్తు తల్లి అయినటువంటి జగన్మాత కేవలం గర్భం దాల్చిన వారినే కాకుండా, సంతానము లేని దంపతులకు కూడా సంతనాభిగ్యాన్ని సిద్ధించేస్తుంది .
పూర్వం ఒక ఆశ్రమంలో నిధ్రువ అనే ఒక మహర్షి ఆయన సహధర్మచారిని అయిన వేదిక తో కలిసి నివసిస్తుండేవారు. వారిరువురు ఎప్పుడూ పరమేశ్వరున్నీ పూజిస్తూ వివాహం చేసున్నవారు ఆచరించవలసిన కర్మలను ధర్మంగా ఆచరిస్తూ ఆ దంపతులు ఇద్దరు ఆనందంగా జీవితాన్ని గడిపేవారు. వారికి ఉన్న ఒకే సమస్య సంతానము కలుగక పోవడం. సంతానము కొరకు ఈ దంపతులు తల్లి జాగన్మాతను , తండ్రి శంకరుడిని విశేష పూజ జప ఆరాధన చేశారు. ఒక మంచి రోజున ఆ తల్లి గర్భం దాల్చింది. ఇలా గర్భం దాల్చిన తర్వాత, ఒక రోజు నిధ్రువ మహర్షి వరుణుడిని కలుసుకోవడానికి బయటకి వెళతారు. అప్పుడు వేదిక మూడవ త్రైమాసికం లో ఉన్నది, కొద్ది రోజులలో ప్రసవం జరగాలసి ఉంది.
నిధ్రువ మహర్షి బయటకి వెళ్ళిన సమయంలో ఊర్ధ్వపాదుడు అనే మహర్షి ఆశ్రమమునకు వచ్చి. అప్పటికే ఇంటి పనులలో అలసిపోయిన వేదిక విశ్రాంతి తీసుకుంటోంది, దాంతో వచ్చిన మహర్షికి అతిథి మర్యాదలు చేయలేక పోవడం తో, ఆయన వచ్చారని విషయం కూడా ఆమెకు తెలియదు. ఊర్ధ్వపాడుడికి ఆగ్రహంతో ఆమె గర్భం ధరించి ఉంది అని తెలియక ఆమెను శపిస్తారు. ఆయన శాప ఫలితంగా వేదిక ఒక వింత వ్యాధితో బాధపడడం మొదలు అవుతుంది. ఆ శాప ఫలితం కారణంగా ఆమె శరీరంలోని భాగాలే కాకుండా, గర్భంలో ఉన్న శిశువు కూడా తినివేయబడడం మొదలు అయ్యింది. వెంటనే ఆమె ఎంతో ఆర్తితో బాధ పడుతూ సర్వ మంగళ స్వరూపమైన తల్లి పార్వతీ మాతను వేడుకుంటుంది.
ఆ చల్లనితల్లి కరుణామూర్తి అయిన జాగన్మాత వెంటనే ప్రత్యక్షం అయి ఆ గర్భస్థ పిండమును ఒక పవిత్రమైన కుండలో ఉంచి రక్షిస్తుంది. ఈ విధం గా రక్షింపబడిన శిశువు ఆ కుండలో పెరిగి చక్కని మగ పిల్లవాడు పుడతాడు. వాడికి నైధ్రువన్ అని పేరు పెడతారు. అప్పుడే పుటిన ఈ శిశువు కి కామధేనువు తన పాలిచ్చి ఆకలి తీరుస్తుంది. ఈలోగా ఆశ్రమం చేరుకున్న నిధ్రువ మహర్షి విషయం తెలుసుకుని ఎంతో సంతోషించి శివ పార్వతులను ఇక్కడే ఉండి రాబోయే తరాలలో కూడా మిమ్మల్ని ఆశ్రయించే వాళ్లకి గర్భ రక్ష కలుగజేయమని ప్రార్ధిస్తాడు.
శౌనక మహర్షి విరచిత శ్రీ గర్భరక్షా స్తోత్రం:
ఓం శ్రీ గణేశాయ నమః
ఓం శ్రీమాత్రే నమః
ఏహ్యేహి భగవాన్ బ్రహ్మన్
ప్రజా కర్తా, ప్రజా పతే
ప్రగృహ్షీణివ బలిం చ ఇమం
ఆపత్యాం రక్ష గర్భిణీమ్. II 1 II
అశ్వినీ దేవ దేవేసౌ
ప్రగృహ్ణీతమ్ బలిం ద్విమం
సాపత్యాం గర్భిణీమ్ చ ఇమం
చ రక్షతాం పూజ యనయా II 2 II
రుద్రాశ్చ ఏకాదశ ప్రోక్తా
ప్రగృహనంతు బలిం ద్విమం
యుష్మాకం ప్రీతయే వృతం
నిత్యం రక్షతు గర్భిణీమ్. II 3 II
ఆదిత్య ద్వాదశ ప్రోక్తా
ప్రగ్రహ్ణీత్వం బలిం ద్విమం
యుష్మాగం తేజసాం వృధ్య
నిత్యం రక్షత గర్భిణీమ్. II 4 II
వినాయక గణాధ్యక్షా
శివ పుత్రా మహా బల
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 5 II
స్కంద షణ్ముఖ దేవేశా
పుత్ర ప్రీతి వివర్ధన
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 6 II
ప్రభాస, ప్రభవశ్శ్యామా
ప్రత్యూషో మరుత నల
దృవూ ధురా ధురశ్చైవ
వసవోష్టౌ ప్రకీర్తితా
ప్రగ్రహ్ణీత్వం బలిం చ ఇమం
నిత్యం రక్ష గర్భిణీమ్. II 7 II
పితుర్ దేవీ పితుశ్రేష్టే
బహు పుత్రీ మహా బలే
భూత శ్రేష్టే, నిశావాసే
నిర్వృతే, శౌనక ప్రియే
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 8 II
రక్ష రక్ష మహాదేవ,
భక్తానుగ్రహకారక
పక్షి వాహన గోవిందా
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 9 II
పై స్తోత్రమును ప్రతీ రోజూ పూజా మందిరంలో, అమ్మ వారికి కొంచెం పళ్ళు, పాలు లేదా ఏదైనా పదార్ధం నివేదన చేసి, ఈ గర్భరక్షా స్తోత్రం క్రింద తెలిపిన విధంగా చదువుకోవాలి.
గమనిక :- గర్భం ధరించిన తరువాత కూడా ఈ పైన చెప్పిన స్తోత్రాన్ని క్రింద తెలిపిన విధంగా చదువుకోవాలి.
- 2వ నెలలో, మొదటి రెండు శ్లోకములు – రోజూ 108 సార్లు
- 3వ నెలలో, మొదటి మూడు శ్లోకములు – రోజూ 108 సార్లు
- 4వ నెలలో, మొదటి నాలుగు శ్లోకములు – రోజూ 108 సార్లు
- 5వ నెలలో, మొదటి ఐదు శ్లోకములు – రోజూ 108 సార్లు
- 6వ నెలలో, మొదటి ఆరు శ్లోకములు – రోజూ 108 సార్లు
- 7వ నెలలో, మొదటి ఏడు శ్లోకములు – రోజూ 108 సార్లు
- 8వ నెలలో, మొదటి ఎనిమిది శ్లోకములు – రోజూ 108 సార్లు
- 9వ నెలలో, మొదటి తొమ్మిది శ్లోకములు – రోజూ 108 సార్లు