సర్వం శ్రీ సాయి సేవ ట్రస్ట్ అద్వర్యం 100 మంది పేద ప్రజలకు అన్నదానం

ఈ రోజు దేశ వ్యాప్తంగా కరోన వైరస్ భయంతో మనల్ని ఇళ్లకే పరిమితి అయిఉన్నాము. మనం మన స్థోమతను బట్టి మన కడుపు నింపుకో గలుగుతున్నాము .. కానీ మనలాంటి మనుషులైన పెద్దవాళ్ళు ఎందరో ఉన్నారు వారి అందరిని ఆదుకోలేక పోయిన మనకు అందుబాటులో ఉన్నవారికి చేయగలిగిన సహాయం మనం తినే దానిలో ఒక్క ముద్ద వారికి పెడదాం.... అన్ని వున్నప్పుడు వారికి ఆ పూటకి బయటకి వెళ్లితేనే వారి కడుపు నిండుతుంది..ఇప్పుడు వారు బయటఉన్న వారికి తినడానికి తిండి లేదు .వారికి తినడకి భోజనం ఇవ్వాలి అని నిన్న మేము చేసిన ఒక చిన్న ఆలోచన .రోజులో 100కి వారికి తినడానికి ఇలా?? ప్రతి రోజు ఏదో ఒక పూట వారికి తినడానికి మంచి భోజనం పెడదాం అని అనుకున్నాము.. (సర్వం శ్రీ సాయి సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు) శ్రీ సాయిరాం గారు చెప్పిన ప్రకారం కొంతమంది ట్రస్ట్ సభ్యులు మరియు కొంత మంది సేవకులు ముందుకు వచ్చారు.. ఈ రోజు వారి సహాయంతో 100 మందికి భోజనం పెట్టగలిగం.. దయచేసి ఈ విషయాన్ని మనం అందరం ఆలోచించి మీ దగ్గరలో ఉన్న పేద యాచకులకు సహాయాన్ని చేయండి.